CID : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుకి సిఐడి అధికారులు అమరావతి భూముల విషయంలో మంగళవారం నోటీసు ఇవ్వటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దళితుల అసైన్డ్ భూములను రూల్స్ ను అతిక్రమించి కొనుగోలు చేసినట్లు ..చంద్రబాబు పాలకవర్గం ఇష్టానుసారంగా భూములు కొనుగోలు చేసినట్లు ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు ఫైల్ చేయడం జరిగింది. దీంతో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిఐడి అధికారులు నిన్న ఉదయం హైదరాబాదులో నివాసం ఉంటున్న చంద్రబాబు ఇంటికి నోటీసులు పంపించటం మనకందరికీ తెలిసిందే.
ఇలాంటి తరుణంలో తాజాగా బాబు హయాంలో మంత్రిగా వ్యవహరించిన నారాయణ నివాసాలలో కూడా సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. నెల్లూరు, విజయవాడ మరియు హైదరాబాద్ నగరంలో నారాయణ నిర్మించుకున్న ఇళ్లల్లో సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో ఏపీ రాజధాని కోసం భూములు సేకరించడంలో కీలక పాత్ర నారాయణ పోషించడంతో ..ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే హైదరాబాదులో నివాసం ఉంటున్న నారాయణ ఆయన ఇంటిలో లేకపోవడంతో నోటీసులు ..ఆయన భార్య రమాదేవికి సిఐడి పోలీసులు ఇవ్వటం జరిగింది. ఈనెల 22వ తారీఖున విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు.