మోడీ కి దేశంలో ఉన్నకొద్దీ క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కంట్రోల్ చేసే విషయంలో చైనాతో ఢీ అంటే ఢీ అనే రీతిలో దూకుడుగా మోడీ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చాలా మందిని మంత్రముగ్ధులను చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలుగులో ప్రాంతీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల పరిస్థితి గతంలో కంటే భిన్నంగా ఉండటంతో… తమిళనాడులో బీజేపీ రాణించడానికి సన్నాహాలు చేస్తుంది.
ఇలాంటి తరుణంలో తమిళ రాజకీయాలను ప్రభావితం చేసే సినిమా స్టార్లు తమిళనాడు బీజేపీలోకి జాయిన్ అవ్వడానికి ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే కుష్బూ రాకతో తమిళనాడు కాషాయ దళంలో జోష్ నెలకొనగా తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోలు బిజెపి కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల హీరో విజయ్ తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ బీజేపీలో అడుగు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని వార్తలు రాగా వాటిలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు.
కానీ మరోపక్క వచ్చే జనవరి నుండి తమిళనాడు బీజేపీ లో భారీ ఎత్తున సినిమా స్టార్లు జాయిన్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రావటానికి రెడీగా ఉన్న పేర్లు గమనిస్తే…గౌతమి, రాధారవి, కస్తూరి రాజా, గాయత్రి రఘురామ్ వంటి వారు రాబోతున్నట్లు టాక్. అంతేకాకుండా జరగబోయే ఎన్నికల్లో దిగ్గజ నటులు రజనీకాంత్, కమలహాసన్ ఇద్దరు కూడా సొంత పార్టీలతో పోటీ చేయబోతున్న తరుణంలో… జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా మారాయి.