అమరావతి, జనవరి 18: పేదరికంపై గెలుపే ఎన్టిఆర్కు ఘన నివాళి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టిటిడి నేతలు, కార్యకర్తలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టిఆర్ ఒక స్ఫూర్తి ప్రదాత, ఆయన వర్థంతి మనకు ఒక సంకల్ప దినం అని చంద్రబాబు అన్నారు. సమాజ సేవలో చురుకుగా పాల్గొనాలనీ, పేదల సేవకు పునరంకితం కావాలని కార్యకర్తలకు ఆయన పిలుపు నిచ్చారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టిఆర్ అని..అందుకే ఫింఛన్లను పది రెట్లు పెంచామని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చంద్రబాబు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఇ పార్కులను అభివృద్ధి చేస్తామనీ, ప్రజల ఆదాయం పెరిగి జీవన ప్రమాణాలు మెరుగు పడాలని చంద్రబాబు అన్నారు.