Ys Jagan : పంచాయతీ ఎన్నికలలో వైసిపి పార్టీ దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. దాదాపు 80 శాతం పైగా స్థానాలు వైసీపీ మద్దతుదారులు గెలవడంతో పాటు ఆఖరుగా చంద్రబాబు నియోజకవర్గంలో కోపంలో కూడా వైసీపీ జెండా ఎగరటం తో..గ్రామాల్లో వైసిపి క్యాడర్ బలోపేతం అయిందని తాజా ఎన్నికలలో నిరూపితమైంది. అన్ని స్థానాలు గెలిచిన గానీ ఇప్పటి వరకు జగన్ మీడియా ముందుకు రాకపోయినా ఓడిపోయిన చంద్రబాబు మాత్రం క్షణక్షణానికీ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తనలో ఉన్న భద్రతా భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కనబడుతోంది.
ఇదిలా ఉంటే త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఎన్నికల గుర్తు ఆధారంగా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో..పంచాయతీ ఎన్నికల మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే విధంగా వైసిపి అధిష్టానం వ్యూహాలు వేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజధానికి దగ్గరగా ఉండే కృష్ణా జిల్లా విజయవాడలో కచ్చితంగా విజయవాడ నగర మేయర్ స్థానం వైసిపికి దక్కే రీతిలో వైసిపి అధిష్టానం సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతుంది. పూర్తి విషయంలోకి వెళితే విజయవాడ మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా బాధ్యతను మంత్రి కొడాలి నాని కి అప్పజెప్పారు వైఎస్ జగన్. కృష్ణా జిల్లా రాజకీయాలలో మంచి పట్టు ఉన్న నేతగా కొడాలి నాని కి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండటంతో..కృష్ణాజిల్లాలో ఖచ్చితం పురపాలక ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలిచే రీతిలో ఫుల్ పవర్స్ కొడాలి నాని కి జగన్ అప్పగించినట్లు ఏపీ రాజకీయాలలో వినబడుతున్న టాక్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?