విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైలుకు వెళ్లే టైమ్ దగ్గర పడిందని టీడీపీ నేతలు విమర్శించారు. రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘రావాలి జగన్… కావాలి జగన్’ అని జైలు గోడలు పిలుస్తున్నాయని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు.
“జగన్ మోహన్ రెడ్డి గారూ… మీరు కోర్టుకి హాజరయ్యి జడ్జిగారి ముందు చేతులు కట్టుకున్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ట్విట్టర్ లో చాలా కష్టపడుతున్నారు. 60 లక్షల ఖర్చు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఖర్చు ఎంత చూపిస్తారు? ఇక టైమ్ దగ్గర పడింది. జైలు అంటుంది రావాలి జగన్… కావాలి జగన్ అని” అంటూ సెటైర్లు వేశారు.
“మేము ఉగ్రవాదులమా? అక్రమ అరెస్టులు ఎందుకు వైఎస్ జగన్ గారు? మీ నియంత పోకడలు ఆపకపోతే మూల్యం చెల్లించుకుంటారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని హరించే అధికారం మీకు ఎవరిచ్చారు?” అని ప్రశ్నించారు.
.@ysjagan గారూ.. మీరు కోర్టుకి హాజరయ్యి జడ్జిగారి ముందు చేతులు కట్టుకున్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ట్విట్టర్ లో చాలా కష్టపడుతున్నారు. 60 లక్షల ఖర్చు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఖర్చు ఎంత చూపిస్తారు? ఇక టైమ్ దగ్గర పడింది. జైలు అంటుంది రావాలి జగన్… కావాలి జగన్ అని.
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) January 10, 2020
మేము ఉగ్రవాదులమా? అక్రమ అరెస్టులు ఎందుకు @ysjagan గారు? మీ నియంత పోకడలు ఆపకపోతే మూల్యం చెల్లించుకుంటారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని హరించే అధికారం మీకు ఎవరిచ్చారు?#SaveAmaravati pic.twitter.com/UvVW3OHcQw
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) January 10, 2020
సీఎం జగన్ ప్రజాస్వామయాన్ని ఖూనీ చేస్తున్నారంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్న మహిళలు, ప్రజాప్రతినిధులు, జేఏసీ ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాజధాని కోసం పోరాడుతున్న రైతుల నుంచి చిందుతున్న రక్తంతో అమరావతి ప్రాంతం ఎర్రగా మారింది. జగన్ పతనం కూడా కూడా మొదలైంది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న నిరసనకారులపై పోలీసుల అండతో ప్రభుత్వం అకృత్యాలకు పాల్పడుతోంది “ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
CM @ysjagan is murdering democracy in Andhra Pradesh. The state has turned red with the split blood of farmers fighting for their capital, Amaravati. The government has responded to peaceful protests with police brutality and section 144 crackdowns. #SaveAmaravati #JaganFailedCM pic.twitter.com/KY0CBtyHNo
— Kesineni Nani (@kesineni_nani) January 10, 2020
మహిళలపై పోలీసుల దమనకాండపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. ” అమరావతి రాజధాని ప్రాంత రైతులు, మహిళలు కనక దుర్గ దేవాలయంలో పూజలు చేయడానికి వెళుతున్నారు. పోలీసులు ఈ చర్య చేపట్టి తమ స్థాయిని దిగజార్చుకున్నారు. దేశ ప్రజలు తమ దేవతలను పూజించుకోవడానికి రాజ్యంగం హక్కులు, స్వేచ్ఛను కల్పించింది. ఇది పోలీసులకు, ప్రభుత్వానికి తెలియదా?” అని ట్వీట్ చేశారు.
Using brutal force & arresting the farmers & women from the capital region, who were going to offer prayers at KanakaDurga Temple, is a new low for the police. They seem to have forgotten the #Law & the #Rights of the people guaranteed by the #Indian #Constitution. #SaveAmaravati pic.twitter.com/YU2rO7du92
— Jay Galla (@JayGalla) January 10, 2020