ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుధీర్ఘంగా నలభై నిముషాలపాటు వీరిద్దరి భేటీ జరిగింది. వీరి భేటీలో చర్చించిన అంశాలు ఇప్పటికైతే బయటకు వెల్లడి కాలేదు. ఏదేమైనప్పటికీ వీరిద్దరి భేటీ ఏపీలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. రీసెంట్ గా జగన్ ఢిల్లీ టూర్లో అమిత్ షాతో రెండుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ నుంచి పిలుపు రావడంతో జగన్ భేటీ కావడం ఆయన రాజకీయ ప్రత్యుర్ధుల్లో వణుకు పుట్టిస్తోంది. నిజానికి దేశం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు ( మోదీ, అమిత్ షా ) అపాయింట్ మెంట్ దొరకడం సామాన్యమైన విషయం కాదు. అటువంటిది తక్కువ సమయంలోనే వీరిద్దరి నుంచి సీఎం జగన్ కు పిలుపు రావడం విశేషం. గతంలో జగన్ వీరి అపాయింట్ మెంట్ కు ప్రయత్నించినా ఫెయిల్ అయిన విషయం తెలసిందే.
మునిగేది చంద్రబాబా.. పవనా..?
జగన్ ఎన్డీఏలోచేరుతున్నట్టు ప్రస్తుతం బయట ప్రచారంలో ఉన్న అంశం. ఇదే నిజమైతే ఇది చంద్రబాబుకు నష్టం కలిగిస్తుందా.. లేక పవన్ కు చేటు చేస్తుందా అనే చర్చలు జరుగుతున్నాయి. జగన్ ఎన్డీఏలో చేరాలంటే రాజకీయ వికేంద్రీకరణకు అంగీకరించాల్సి ఉంటుంది. న్యాయపరమైన చిక్కులు కూడా తొలగించాల్సి ఉంటుంది. జగన్ కోరుకున్న అధికారులను ఏపీకి ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా తన రాజకీయ శత్రువు చంద్రబాబుపై అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో సీబీఐ కేసులు పెట్టించే అవకాశం ఉంటుంది. ఇందుకు బీజేపీ ఒప్పుకుంటే టీడీపీకి భారీ నష్టం తప్పదు. మరో వైపే జనసేనానికి కూడా నష్టం పొంచి ఉంది. అదేంటంటే..
బీజేపీతో దోస్తీ ఉంటుందా.. పోతుందా..?
పవన్ కల్యాణ్ ఈమధ్య బీజేపీతో కలిసి నడుస్తున్నారు. బీజేపీతో పొత్తు కలుపుకుని జెండాలు కూడా కలుపుకున్నారు. వైసీపీని సీఎం జగన్ ను బీజేపీ చిన్న కర్రలతో కొడుతుంటే.. పవన్ మాత్రం పెద్ద కర్రతోనే కొడుతున్నారు. ఇప్పటికీ పవన్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్దిగా జగనే ఉన్నారు. అమరావతి విషయంలో జగన్ కు వ్యతిరేకంగా వెళ్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఎన్డీఏలో వైసీపీ చేరితే.. ఇప్పటికే బీజేపీతో కలిసి నడుస్తున్న పవన్ నష్టం చేకూరినట్టే. అందుకే జగన్ ఢిల్లీ టూర్ అటు చంద్రబాబుకు, ఇటు జగన్ కు చెమటలు పట్టిస్తోందని చెప్పాలి.