వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని అధిష్టానం ఎందుకు సీరియస్ గా తీసుకోవటం లేదనే ప్రశ్న పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నాలుగైదు నెలలుగా వరుస ప్రెస్ మీట్లతో పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీస్తున్నాడు. అయినా.. పార్టీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎంపీపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసి అక్కడితో ఆగిపోయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. అతని మీద చర్యలు తీసుకునేలా సంప్రదింపులు చేయడం.. బీజేపీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకునే చేయడం వైసీపీ చేయడం లేదు. తనకు అందుతున్న సమాచారం ప్రకారం జగన్ కు వ్యతిరేకంగా పార్టీలోనే ఉంటూ తవ్వాల్సిన గోతులు తవ్వేస్తున్నారు. మొత్తానికి ఆయన చేస్తున్న డ్యామేజీని పార్టీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
జాతీయ మీడియా దృష్టిలో కీలక సమస్యలు..
రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని తెలుగు మీడియా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కేవలం టీడీపీ అనుకూల మీడియా మాత్రమే ఆయనకు విరివిగా కవరేజ్ ఇస్తున్నాయి. కానీ.. రఘురామకృష్ణరాజుకు జాతీయస్థాయిలో ఉన్న పరిచయాలు, మీడియా పరిచయాలతో అంతర్గత పరిచయాలతో జాతీయ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. జగన్ పరిపాలనలో జరుగుతున్న తప్పులను ఆయన ఢిల్లీలోని జాతీయ మీడియాలో వచ్చేలా రాయిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలోని అంశాలను జాతీయస్థాయిలో హైలైట్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. దీనివల్ల ఉత్తరాదిలో ఏపీ ప్రభుత్వంపై, రాష్ట్రంపై చులకన భావం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది బయటకకు తెలియని అంశమే. ఏపీ ఎంపీగా ఆయనను పరిణగిస్తారు తప్ప పార్టీలో జరుగుతున్న పరిణామాలను గుర్తించే అవకాశం లేదు. ఇవి ఖచ్చితంగా వైసీపీని డ్యామేజ్ చేసేదే.
అవకాశం కోసం వైసీపీ ఎదురుచూస్తోందా..
పార్టీకి ఇంత నష్టం చేస్తున్నా సీఎం స్పందించకపోవడం.. ఆయనను పట్టించుకోకపోవడం పార్టీకే నష్టం. పశ్చిమగోదావరి జిల్లాలో ఇళ్ల కేటాయింపులు, ఇసుక రీచ్ ల్లో స్థానిక వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు అని చేసిన వ్యాఖ్యల నుంచీ ఇప్పటివరకూ రఘురామకృష్ణరాజు వైసీపీని దూనమాడుతూనే ఉన్నారు. షోకాజ్ నోటీసు ఇవ్వడం దానిపై రచ్చ జరగడం కూడా జరిగింది. అయితే.. స్పీకర్ కు ఫిర్యాదు చేయడం ద్వారా అనర్హత వేటు వేయడానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయనేది ఓ వాదన. అనర్హత వేటు వేయగానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయాలనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తుంది. కానీ.. ఈలోపు చేయాల్సిందంతా చేసేస్తున్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు.