YS Jagan KTR: ప్రపంచ వాణిజ్య సదస్సు (WEF) అత్యంత ప్రతిష్టాత్మకంగా స్విజర్లాండ్ లోని దావోస్ లో సమావేశాలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు అంతర్జాతీయ ఆయ వాణిజ్య సంస్థల ప్రముఖులు.. పలు రాజకీయ నాయకులు భారీ ఎత్తున పాల్గొంటారు. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఈ సమ్మిట్ జరుగుతూ ఉంటుంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ..గత కోన్ని సంవత్సరాల నుండి వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సారి మే నెలకి పోస్ట్ పోన్ అయ్యింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైం ఈ సదస్సు జరుగుతోంది.
ఈ క్రమంలో ఈ సమావేశానికి జగన్ తో పాటు 17 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. మే 22 నుంచి 26 వరకు దావొస్ లో జరిగే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి స్టార్టింగ్ లో వైయస్ జగన్ తో పాటుగా తెలంగాణ నుండి మంత్రి కేటీఆర్ కి కూడా ఫోరం అధ్యక్షుడు బోర్జు బ్రిండే ఆహ్వానం పంపడం జరిగిందట. దీంతో మంత్రి కేటీఆర్ కూడా జరగబోయే ఈ ప్రపంచ వాణిజ్య సదస్సు సమావేశానికి హాజరవడానికి రెడీ అయినట్టు సమాచారం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మే 22 నుంచి 26 వరకు జరగబోయే ఈ సమావేశాలకు ప్రపంచవ్యాప్తంగా… పేరుగాంచిన పారిశ్రామికవేత్తలు… రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇండియా నుండి దాదాపు వంద మంది హాజరు కానున్నట్లు సమాచారం. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ అదేవిధంగా మంత్రి కేటీఆర్ ఇదే సమావేశానికి హాజరు కానున్నట్లు వార్తలు రావడంతో.. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ వార్త వైరల్ గా మారింది. ఇక ఇదే సమావేశానికి భారత ప్రధాని మోడీ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు.