CM KCR: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి CM సిఆర్ నేడు ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాల (National Politics)పై దృష్టి పెట్టిన కేసిఆర్ (KCR)ఢిల్లీ పర్యటనకు వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రంలోని బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమికి నేతృత్వం వహించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసిఆర్..ఇప్పటికే ముంబాయికి వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే, ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలిశారు. జాతీయ రాజకీయాలపై చర్చించి వచ్చారు. దానికి కొనసాగింపుగా కేసిఆర్ ఢిల్లీ యాత్ర సాగనుందని సమాచారం.
Read More: YS Jagan KCR: కేసిఆర్, జగన్ ఇద్దరూ ముందస్తుకే..!? ఎవరి సీక్రెట్ ప్లాన్స్ వారివే..!
CM KCR: ప్రాంతీయ పార్టీ అధినేతలతో..
ఢిల్లీలో కేసిఆర్ పలువురు ప్రాంతీయ పార్టీ అధినేతలతో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తోనూ సమావేశం అవుతారని తెలుస్తోంది. ప్రధానంగా త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలపై ఆయన వివిధ పక్షాల నేతలతో సమావేశం కానున్నారని సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగ అందరికీ అనుకూలమైన రాష్ట్రపతి అభ్యర్ధిని నిలబెట్టాలన్న లక్ష్యంతో కేసిఆర్ ఉన్నారు. కేసిఆర్ ఆలోచనలకు శరద్ పవార్, ఉద్దవ్ థాకరే కూడా ఆంగీకరించారని తెలుస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికలపై
రాష్ట్రపతి ఎన్నికల్లో నితీష్ కుమార్ ను అభ్యర్ధిగా నిలబెట్టే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కేసిఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే క్రమంలో ఢిల్లీలో నిర్మాణం అవుతున్న టీఆర్ఎస్ ఆఫీసును కేసిఆర్ పరిశీలించే అవకాశం ఉంది. కే సిఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, కొందరు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.