Stalin: స్టాలిన్ Stalin తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారనే విషయం తెలిసిందే. డీఎంకే అధికారంలోకి వచ్చింది.. ఆయన సీఎం అయ్యారు. ఇది పెద్ద విషయం కాదు కానీ.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాలకు వేదిక అవుతున్నాయి. సరికొత్త రాజకీయానికి నాంది పలుకుతోంది. అధికారం వచ్చింది కదా అని .. ‘మాకంతా తెలుసు.. మా ప్రభుత్వం మాత్రమే పనులన్నీ చేయగలదు.. అంతా మేమే..’ అనే సదరు రాజకీయ భావనకు ఆయన దూరమని నిరూపిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఉదాహరణ. రాష్ట్రంలో కరోనాపై పోరుకు 13 మంది ఎమ్మెల్యేలతో ఓ సలహా కమిటీని నియమించి.. అందులో 12 మంది విపక్ష సభ్యులనే తీసుకోవడం సంచలనం రేపుతోంది.
స్టాలిన్ కు సీఎం పీఠం కొత్త కావొచ్చు కానీ.. రాజకీయాలు కొత్త కాదు. తండ్రి సీఎంగా ఉండగా డిప్యూటీ సీఎంగా కూడా పని చేశారు. ఆ అనుభవంతోనే ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని చెప్పాలి. పైగా.. ఈ కమిటీలో గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన విజయ్ కుమార్ ను కూడా భాగస్వామిని చేశారు. స్వయంగా ఆయనే సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ తమ అనుభవంతో ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రకటన చేశారు. సమకాలీన రాజకీయాల్లో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. దీనివల్ల ప్రభుత్వం విపక్షాలతో కలిసి కరోనాపై పోరు సాగిస్తుంది. సలహాలతో ముందుకెళ్తుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు, ఆరోపణలకు తావుండదు.
సమకాలీన రాజకీయాల్లో ఇటువంటి విధానాన్ని ఎక్కడా కనిపించదు. ప్రభుత్వం తీసుకునే చర్యల్లో విపక్షాలను కలుపుకుని ముందుకెళ్లడం వల్ల ప్రభుత్వానికి కూడా పని సులువు అవుతుంది. స్టాలిన్ రాజకీయ పరిణితి ఇందుకు దోహదపడిందని చెప్పాలి. ఇటివలే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనా సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. కమిటీలో స్టాలిన్ చైర్మన్ గా ఉంటారు. మిగిలిన సభ్యుల్లో ఎజిలన్-డీఎంకే, విజయభాస్కర్-అన్నాడీఎంకే, జీకే మణి-పీఎంకే, ఏఎం మణిరత్నం-కాంగ్రెస్, నగర్ నాగేంద్రన్-బీజేపీ, సుశాన్ తిరుమలైకుమార్-ఎండీఎంకే, ఎస్ఎస్ బాలాజీ-వీసీకే, టి.రామచంద్రన్-సీపీఐ, జవహరుల్లా-ఎంఎంకే, ఆర్ ఈశ్వరన్-కేఎండీకే, టీ.వేల్ మురుగున్-టీవీకే, పూవై జగన్ మూర్తి-పీబీ, నాగై మాలి-సీపీఎం.. పార్టీల వారు ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?