నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీలో కీలక నేతలుగా అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాణించడం జరిగింది. ఇద్దరి సామాజికవర్గాలు వేరైనా గాని అన్నదమ్ములు మాదిరిగా రిలేషన్ షిప్ మెయింటెన్ చేసే వారు. ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదించే రీతిలో ఇద్దరి మధ్య బంధం ఉండేది. నియోజకవర్గాలు వేరైనా తాము ఇద్దరం ఒకటే అన్న రీతిలో మెలిగేవారు.
సామాన్య కుటుంబాల నుండి వచ్చిన వీళ్ళిద్దరూ నెల్లూరు జిల్లాలో మహామహా తల పండిపోయిన రాజకీయ నేతలతో తలపడి…. ప్రస్తుతం కీలక నేతలుగా రాణిస్తున్నారు. నెల్లూరు సిటీ నుంచి ఒకరు నెల్లూరు రూరల్ నుంచి మరొకరు…. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆశ్చర్యపరిచారు. అనేకసార్లు ఇద్దరిపై ఆరోపణలు రకరకాల గా వచ్చిన గాని తిప్పి కొట్టడం జరిగింది. మంత్రిగా అనిల్ కుమార్ జిల్లాకి తొలిసారి వచ్చినప్పుడు కనీవినీ రీతిలో స్వాగతం పలికారు కోటంరెడ్డి.
ఇంతటి స్నేహబంధం ఉన్న ఇద్దరి నేతల మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లు, ఒకరంటే మరొకరికి పడనట్లు జిల్లా రాజకీయాల్లో టాక్. ఎమ్మెల్యే కోటంరెడ్డి చేస్తున్న సిఫార్సులను మంత్రి అనిల్ కుమార్ పట్టించుకోవడం లేదని అధికార పార్టీలో జరుగుతున్న చర్చ. దీంతో తన మాటని నెగ్గక్కపోవడంతో అమరావతి కి వెళ్లి పార్టీ పెద్దలతో లాబీయింగ్ చేసుకునే పరిస్థితి కోటంరెడ్డి కి వచ్చిందట.
వివిధ ప్రభుత్వ శాఖలలో ఇటీవల జరిగిన బదిలీలు, మున్సిపాలిటీలో పాలన వ్యవహారాలు లే అవుట్ లా అనుమతులు, ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారుల ఎంపిక, ఇలా వివిధ అంశాలలో ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట నెగ్గడం లేదని కామెంట్స్ వినబడుతున్నాయి. ఎస్సై, సీఐల బదిలీలు…. Covid19 ఆసుపత్రి సూపర్డెంట్ బదిలీల రచ్చ గట్టిగా జరిగినట్లు తెలుస్తోంది.
చాలా అధికారుల బదిలీల విషయంలో కోటంరెడ్డి ఎక్కువ నడుస్తున్న తరుణంలో ఈ సారి ఐఏఎస్లను తీసుకురావాలని కోటంరెడ్డి కి చెక్ పెట్టడానికి మంత్రి అనిల్ కుమార్ ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అభివృద్ధి పనుల విషయంలోనూ ఎమ్మెల్యే ఒకటి చెబితే మంత్రి మరొకటి అంటున్నారట. చాలా విషయాలలో ఏకాభిప్రాయం ఇద్దరికి కుదరటం లేదని, ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నట్లు వైసీపీ పార్టీలో టాక్.