ఏపీ సీఎం వైఎస్ జగన్ పేదలందరికీ ఇళ్ల పట్టాలు కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమి పెద్దగా అందుబాటులో లేకపోవడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా భూసేకరణలో జరుగుతున్న గోల్మాల్ యవ్వారాలు వైసీపీ పార్టీ కొంప ముంచుతున్నాయి. వీటి గురించి తెలుసుకున్న వారు సొంత పార్టీ నేతలే కథలు కథలుగా చెప్పుకుంటూ నట్లు ఏపీలో వార్తలు వినబడుతున్నాయి.
రాజధాని ప్రాంతం గుంటూరు లో పదహారు వేల లబ్ధిదారులను సెలక్ట్ చేశారు. అయితే వారికి కేటాయించడానికి నగరంలో స్థలం లేదు. దీంతో సమీపంలో రెండు నియోజకవర్గాలలో భూసేకరణ కి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ తరుణంలో మంచి పరిచయాలు కలిగిన ఓ ప్రజాప్రతినిధి మరో అధికారి కలసి భూసేకరణని తమకు అనుకూలంగా మలుచుకుని కోట్ల రూపాయల దందాకు తెర తీసినట్లు ఏపీలో వార్తలు వినబడుతున్నాయి. ఇదే రీతిలో చాలా చోట్ల వైసీపీ నాయకులు వ్యవహరించినట్లు వార్తలు రావడంతో… సామాన్య ప్రజలలో అధికార పార్టీపై విమర్శలు వస్తున్నాయి.