Lock Down : దేశంలో సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. కేసును తీవ్రంగా బయట పడుతున్న నేపథ్యంలో మరోపక్క హాస్పిటల్స్ లో బెడ్ లు కూడా దొరకని పరిస్థితి ఉండటంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. మరో పక్క కేంద్రం ఇప్పటికే దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచనలు ఇస్తూ ఉంది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ఎంత శరవేగంగా జరిగితే అంత మంచి చేసినవారవుతారు పేర్కొంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి చోట్ల లాక్ డౌన్ అమలు అయ్యే తరహాలో ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే జాబితాలో కి ఛత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్ కూడా వచ్చేసింది. కరోనా కట్టడి కోసం ఛత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్ లో ఈ నెల 9 నుంచి 19 వ తారీకు వరకు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయడానికి అక్కడి ప్రభుత్వం రెడీ అయ్యింది.
రాయ్పూర్లో భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతూ ఉండటంతో హాట్ స్పాట్ గా మారే పరిస్థితులు ఉండటంతో ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవటం జరిగింది. నిన్న ఒకే రోజు.. ఛత్తీస్గఢ్లో 9,921 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 3,86,269 చేరుకోగా.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 4,416 మంది కన్నుమూశారు. ఇదిలా ఉంటే రాబోయే రోజులలో దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.