తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ అక్కడ కేసీఆర్, కేటీఆర్ హవానే నడుస్తోంది. వారేం చెప్తే అది ఆ రాష్ట్రంలో జరగాల్సిందే. జరుగుతోంది కూడా. చట్టం అమలు, శిక్ష కూడా వారిదే. ఏకంగా రాష్ట్రమే వారిది అన్నట్టుగా హవా కొనసాగుతోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, సహకరించిన బీజేపీ పాత్రే లేదన్నట్టు చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. దీంతో.. ఇలా ఎన్నాళ్లు అనే ప్రశ్న ఆ రెండు పార్టీల్లో మొదలైంది. కనీసం జీహెచ్ఎంసీని అయినా చేజిక్కించుకోకపోతే ఎలా? అందుకే ఆ జాతీయ పార్టీలు తమ వ్యూహాలతో ఈసారి టీఆర్ఎస్ ను పక్కాగా ఫిక్స్ చేసే పనిలో పడ్డాయి.
సుదూర లక్ష్యానికి కాంగ్రెస్ గురి..
2014 ఎన్నికల్లో ‘తెలంగాణ ఇచ్చింది మేమే’ అన్న కాంగ్రెస్ మాటలు అరణ్యరోదనే అయ్యాయి. తర్వాత 2018 ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ పెద్దల్లో చాలామంది టీఆర్ఎస్ లో చేరిపోవడంతో కాంగ్రెస్ బలహీనపడింది. అయ్యిందేదో అయింది.. 2023 ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఇప్పటినుంచే అడుగులు వేస్తోంది. ఆ ఎన్నికల్లో 79 సీట్లు తెచ్చుకోవాల్సిందే అని తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మాణికం ఠాగూర్ లక్ష్యం నిర్దేశించారు. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటి 2023 ఎన్నికలకు సిద్ధమవ్వాలన్నది వారి ప్లాన్. అయితే.. నాయకుల కొరత, సన్నగిల్లుతున్న కేడర్ తో కాంగ్రెస్ ఏమేరకు లక్ష్యాన్ని చేరుకుంటుందో చూడాలి.
జీహెచ్ఎంసీతోనే సత్తా చాటాలని బీజేపీ..
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని ఎప్పటినుంచో చెప్పుకుంటోంది బీజేపీ. అయితే.. అందుకు తగ్గ ఫలితాలను 2014, 2018 ఎన్నికల్లో చూపలేకపోయింది. అందుకే.. ఇప్పుడు జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటి ఆ మాట నిజం చేసుకోవాలని ప్లాన్ వేస్తోంది. గ్రేటర్ లో 80 సీట్లు సాధించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, కాంగ్రెస్, బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో 80 సీట్లు గెలిచేంత ప్రజాదరణను బీజేపీ ఈ నాలుగేళ్ల కాలంలో సాధించిందా అనేది ఓ ప్రశ్న. ఈ నేపథ్యంలో రెండు జాతీయ పార్టీల సత్తా ఏంటో.. టీఆర్ఎస్ ను ఏమేర దెబ్బ కొడతారో త్వరలోనే తేలనుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?