దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పార్టీ గ్రౌండ్ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు అత్యంత బలమైన క్యాడర్ కలిగిన పార్టీ. ఈ పార్టీలో పనిచేసిన చాలా మంది నాయకులు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన నాటినుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకొనే స్థితిలో లేదు అనే టాక్ గట్టిగా వినబడుతోంది. కాంగ్రెస్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం ఆ పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేకపోవటమే. ఇటీవల పార్టీకి కొత్త అధ్యక్షుడిని తీసుకురావటానికి సోనియాగాంధీ రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇదే తరుణంలో పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు రాహుల్ గాంధీ తిరిగి ఆ పదవిని చేపట్టాలని డిమాండ్ చేశారు. కానీ రాహుల్ మాత్రం ఆసక్తి చూపించలేదు.
ఇదే టైములో ప్రస్తుతం పార్టీలో కీలకంగా మారుతున్నారు ప్రియాంక గాంధీ కూడా అధ్యక్షుడి పదవి విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పరిస్థితి ఇలా ఉండగా పార్టీని ముందుకు నడిపించాలంటే కచ్చితంగా బాధ్యతాయుతమైన నేత అవసరమని, ఇలాంటి వారు దక్షిణాది రాజకీయాల్లో దొరుకుతారు అని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినపడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దక్షిణాది ప్రాంతానికి చెందిన ఓ కీలక నేత నీ ఎన్నిక చేసుకోవటానికి కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే సదరు నేత తో పార్టీలో కీలక నాయకులు సంప్రదింపులు జరిపినట్లు, అంతా ఓకే అయినట్లు, త్వరలోనే బాధ్యతలు మొత్తం అతనికి అప్పజెప్పడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో ఆ రాజకీయ నేత ఎవరు అన్నది పార్టీలో సస్పెన్స్ గా మారింది.