వైఎస్ రాజశేఖర్ చనిపోయిన నాటినుండి వైయస్ జగన్ రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ యే ఆయన చనిపోయాక ఆయన కుమారుడు వైయస్ జగన్ ని అనేక ఇబ్బందులకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అంటుంటారు. చాలా వరకు ప్రస్తుతం రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్న వైయస్ జగన్ విషయంలో అక్రమంగా పెట్టిన కేసులు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులే. దాదాపు పది సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయ యుద్ధం చేసిన వైఎస్ జగన్….2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో సీఎం అవ్వడం జరిగింది.
సీఎం అయ్యాక ఏడాది పరిపాలనలోనే దేశవ్యాప్తంగా తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి పేరు సంపాదించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ లీడర్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్ అడ్మినిస్ట్రేషన్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా కరోనా నియంత్రణలో జగన్ వ్యవహరించిన తీరు అద్భుతం అని ప్రశంసించారు. కరోనా ని ఎదుర్కొనే విషయంలో వైయస్ జగన్ అనుసరిస్తున్న విధానం చాలా బాగుందని చెప్పుకొచ్చారు. ఇదే టైములో తెలంగాణ లో సీఎం కేసీఆర్ కరోనా విషయంలో ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద వారిని దృష్టిలో పెట్టుకొని వైయస్ జగన్ కరోనా ని ఆరోగ్యశ్రీలో చేర్చారని అదే విధంగా సీఎం కేసీఆర్ కూడా చేర్చాలని ఉత్తంకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా అనేక విషయాలలో సీఎం కేసిఆర్ పరిపాలన పై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.