లక్నో, జనవరి 12: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లోని 80 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ యుపీ ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ఆదివారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ యుపీలో పోటీకి సిద్ధం అయినట్లు తెలిపారు. 2009 లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటామనీ, మరో మారు అత్యధిక సీట్లు గెలుస్తామనీ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు అన్ని పార్టీలను కలుపుకొనే పోటీ చేస్తామనీ, అందుకు మాతో కలవమని ఎవరినీ వత్తిడి చేయమని ఆయన అన్నారు. ఎస్పీ, బిఎస్పిలు కాంగ్రెస్తో పొత్తు అంశానికి ముగింపు పలికినా తమ సొంత శక్తిని నమ్ముకునే బిజెపిపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
ఎన్నికల గురించి ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్తో పాటు పలువురు నేతలతో ఆయన చర్చించారు.
యూపీలో మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.
సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు రానున్న ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని శనివారం ప్రకటించాయి.
previous post
next post