ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎక్కువ జరుగుతున్న పేరు తప్ప కరోనా కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు అయితే ఈ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని రోజూ మీడియా ముందు నిలదీస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా వచ్చిన ప్రారంభంలో ఈ జిల్లాలో మరియు విజయనగరం జిల్లాలో అస్సలు పాజిటివ్ కేసులు బయటపడలేదు.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే శ్రీకాకుళం జిల్లాలోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు నెల ఆఖరికి దాదాపు 25 వేల పాజిటివ్ కేసులు బయటపడినట్లు లెక్కలు చెబుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో అక్షరాల 17 వేల కంటే ఎక్కువ కేసులు బయటపడటంతో జిల్లా ప్రజలు అడుగు తీసి అడుగు బయట వేయడానికి బిక్కుబిక్కుమంటున్నారు.
మరోపక్క పరిస్థితిని అదుపులోకి తీసుకు రావటానికి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు అధికారులు. అయితే కొంతమంది నిబంధనలు ఉల్లంఘించి బయట ఇష్టానుసారంగా తిరుగుతున్నా వారి వల్ల కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు జిల్లా అధికారులు తెలుపుతున్నారు. ప్రతి ఆదివారం టోటల్ లాక్ డౌన్ విధిస్తున్నారు. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ఆకతాయిలు పని పట్టడానికి జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?