కరోనా వైరస్ ప్రభావం దేశంలో ఉన్న కొద్ది పెరుగుతూనే ఉంది. దేశంలో వర్షాలు పెరుగుతున్న కొలది కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్న తరుణంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రజలకు వైద్యం కల్పించే విషయాల్లో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దేశంలో మెట్రో నగరాలలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బెంగళూర్, హైదరాబాద్, పూణే వంటి నగరాలలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. దేశం మొత్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో ఈ మూడు నగరాల నుంచి ఎక్కువగా పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి.
గతంలో కరోనా విషయంలో డేంజరస్ సెంటర్స్ గా ఉన్నా ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ ల కంటే బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. 50 లక్షలు కలిగిన అర్బన్ ఏరియా లో నమోదవుతున్న కేసులు పరిశీలిస్తే బెంగళూరులో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గడిచిన నాలుగు వారాలుగా బెంగుళూరులో కరోనా పెరుగుదల 12.9 శాతంగా ఉంది. బెంగళూరులో మరణాల రేటు కూడా ఆందోళనకరంగా ఉంది. ఇదే పరిస్థితి హైదరాబాద్ మరియు పూణే రాష్ట్రాలలో కూడా నెలకొని ఉంది. మెట్రో నగరాలు కాబట్టి సాధారణంగా రాకపోకలు ఎక్కువ ఉండటంతో వైరస్ ప్రభావం ఈ స్థాయిలో ఉందని అధికారులు చెప్పుకొస్తున్నారు.