దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్న… మరోవైపు కరోనా రికవరీ కేసుల సంఖ్య ఉన్న కొద్ది పెరుగుతూనే ఉంది. దేశంలో ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్న వారి సంఖ్య కంటే కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది చాలా వరకు పోరాటం ఇచ్చే వార్త అని చెప్పవచ్చు. గడచిన 24 గంటల్లో ఒకేరోజు రికార్డు స్థాయిలో 51 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్ లో కరోనా వైరస్ బాధితుల రికవరీ రేటు 67.19 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 2.09 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఒక్కరోజులోనే ఈ విధంగా రికవరీ రేటు పెరగటం, మామూలు విషయం కాదని, నిజంగా భారత్ కరోనా రికవరీ రేటు విషయంలో ప్రపంచంలోనే సూపర్ రికార్డ్ సృష్టించిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య 19 లక్షలు దాటగా అందులో 12 లక్షల 82వేలకు పైగా బాధితులు కోలుకోవటం జరిగింది. 39 వేల 795 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 5,86,244 కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఏది ఏమైనా గతంలో కంటే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో రికవరీ రేటు పెరగడం అన్నది కొంత ఊరటనిచ్చే వార్త అని వైద్యులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క కరోనా వ్యాక్సిన్ విషయంలో జరుగుతున్న ప్రయోగాలలో చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడంతో…త్వరలోనే కరోనా ని జయించే రోజులు ముందు ఉన్నాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?