(అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి)
రాష్ట్రంలో, దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుండి ప్రముఖులు, సెలబ్రిటీలను కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనా బారిన పడ్డారు. అయితే మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం చాలా మంది ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తున్నది.
ఇటీవల తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంట మంత్రి వెల్లంపల్లి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా వారం రోజుల పాటు వెల్లంపల్లి తిరుమలలోనే ఉన్నారు. ఈ నెల 25న వెల్లంపల్లి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ వచ్చినప్పటి నుండి కరోనా లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వెంటనే వెల్లంపల్లి విజయవాడలోని ఒ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారం రోజులుగా ఆయనతో కాంటాక్ట్ లో ఉన్న అధికారులు, నాయకులలో ఆందోళన మొదలైంది.