శశికళ కు జైలు నుండి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు భారీ స్థాయిలో స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి తరుణంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శశికళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటంతో పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయలలిత మరణించిన తర్వాత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెల 27వ తారీకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి శశికళ విడుదలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇంతలోనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. జ్వరం రావడంతో జైలు అధికారులు బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేయడం జరిగింది. చేసిన పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో శశికళ నీ పోలీసులు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ తరుణంలో జైలు నుంచి హాస్పిటల్ కి ఆమె వెళ్తున్న సమయంలో అభిమానులు భారీ ఎత్తున రావడం జరిగింది. ఈ క్రమంలో శశికళ అభిమానులను చూసి చేతులూపుతూ అభివాదం చేశారు.