Corona : దేశంలో కరోనా వైరస్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గానీ వైరస్ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు భయాందోళనలకు గురి అవుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇండియాలో సెకండ్ వేవ్ మళ్లీ స్టార్ట్ అయిపోయినట్లే అని డిసైడ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ … ప్రారంభమయ్యాయి అని అనుకుంటున్న రాష్ట్రాలలో ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను… రంగంలోకి దింపింది కేంద్రం. మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక, కేరళ ఇంకా మరికొన్ని చోట్ల కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తూ సరికొత్త ఆదేశాలు ఇస్తూ ఉంది కేంద్రం.
ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్కూల్స్ విషయంలో అక్కడి గవర్నమెంట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జూన్ మాసంలో ఉండే ఆన్లైన్ విధానం ద్వారా క్లాసులు ప్రారంభించిన తమిళనాడు సర్కార్ కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో 9,10,11 తరగతికి చెందిన విద్యార్థులకు ఎలాంటి రాత పరీక్షలు లేకుండా క్లాసులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
మరోపక్క కేసులు ఇంకా పెరిగితే స్కూల్స్ మరియు కాలేజీలు మళ్లీ క్లోజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో..ప్రధాన పార్టీల నాయకులు కొద్దిగా టెన్షన్ లో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే కరోనా కారణంగా గుంపులు, గుంపులుగా ప్రజలు తిరిగే పరిస్థితి మళ్లీ రాబోయే రోజుల్లో ఉండదు అనే వాదన బలంగా వినబడుతోంది. దీంతో ఎన్నికల ప్రచారానికి అడ్డంకులు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినపడుతుంది.