ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే ఎక్కువగా మూల్యం చెల్లించింది అమెరికా. వైరస్ నీ చాలా లైట్ తీసుకున్న ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్.. విమర్శ లు ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో అమెరికాలో పరిస్థితి చేయి దాటి పోయే విధంగా మారటంతో… ప్రపంచ పటం లో అమెరికా దేశం కనబడదు అనే వార్తలు వచ్చాయి. ఆ విధంగా సింపుల్ గా తీసుకున్న డోనాల్డ్ ట్రంప్ కి ఇటీవల కరోనా రావడం పెద్ద సెన్సేషన్ న్యూస్ అయ్యింది. ఈ సమయంలో వైట్ హౌస్ లో ఉండే సిబ్బందికి కూడా కరోనా రావడం అంతర్జాతీయ మీడియాలో సెన్సేషనల్ వార్త గా నిలిచింది.
ఇదిలా ఉండగా మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగనున్న తరుణంలో కరోనా అమెరికా ప్రభుత్వాని, ప్రజలను భయపెడుతున్నట్లూ టాక్. ఇలా ఉండగా డెమోక్రటిక్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న నాయకులు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వైరస్ విషయంలో వ్యవహరించిన తీరును.. ఎండగడుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ మూర్ఖత్వం నిర్ణయాల వల్ల రెండు లక్షల కుటుంబాలలో విషాదం నెలకొన్నట్లు భారీ స్థాయిలో డెమోక్రాట్లు విమర్శలు చేస్తున్నారు.
మరోపక్క కరోనా నుండి కోలుకున్న ట్రంప్ ప్రచారం లో దూసుకుపోతున్నరు. తనకి కరోనా వైరస్ రావటం దేవుడిచ్చిన ఆశీర్వాదం అని పేర్కొన్నారు. అంతేకాకుండా వైరస్ సోకడం వల్ల మిలటరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున ట్రంప్.. కరోనాకు వైద్యులు అందిస్తున్న చికిత్స ఎంత అద్భుతమైనదో తెలుసుకోగలిగాం అని అన్నారు. వైరస్ విషయంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నాయకులు కంటే తానే ముందు అలర్ట్ అయినట్లు ఇటీవల ప్రచారంలో తెలిపారు.