Ys Jagan : దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటినుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో దేశ ప్రధాని చేత మరియు కేంద్ర మంత్రుల చేత అదేరీతిలో ఇతర దేశాల అధినేతల చేత కూడా జగన్ శభాష్ అనిపించుకోవటం జరిగింది. అంతే కాకుండా రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారికి అండగా నిలబడుతూ.. క్వారంటైన్ లో ఉన్నవారికి నాణ్యమైన భోజనం పెట్టడమే కాక క్వాలిటీ ట్రీట్మెంట్ అప్పట్లో ఇచ్చారు.
ముఖ్యంగా భారీ ఎత్తున ఎక్కడికక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి.. దేశంలోనే కరోనా కట్టడి చేయడంలో ఏపీ టాప్ అన్న రీతిలో జగన్ ప్రభుత్వం అడుగులు వేయడం జరిగింది. ఇప్పుడు ఇదే తరహాలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ వేసే విషయంలో కూడా సరికొత్త ఆలోచన చేసింది. మేటర్ లోకి వెళ్తే రాష్ట్రవ్యాప్తంగా రోజుకి ఆరు లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వెయ్యటానికి జగన్ సర్కార్ రెడీ అయింది.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ కి సీఎం జగన్ లెటర్ రాయడం జరిగింది. 25 లక్షల వ్యాక్సిన్ డోస్ లు రాష్ట్రానికి పంపించాలని కోరారు. ప్రతి గ్రామంలో మరియు వార్డుల్లో టీకా ఉత్సవ్ పేరిట వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిపిస్తున్నట్లు లెటర్లో మోడీకి జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కి తెలియజేసి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25లక్షల వ్యాక్సిన్ డోస్ లు పంపాలని జగన్ కోరారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని.. స్పష్టం చేశారు.