దేశంలో జనవరి 16వ తారీకు ప్రధాని మోడీ చేతుల మీదగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. చాలావరకు ఇతర దేశాల కంటే ఇండియా కరోనా వ్యాక్సిన్ అద్భుతంగా ఫలితాలు సాధించడంతో ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో ఆర్డర్ లు పెడుతూ ఉన్నాయి. ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పేద దేశాలకు అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది.
పరిస్థితి ఇలా ఉండగా ఇండియా కరోనా వ్యాక్సిన్ తయారీదారు సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. పూణేలోని సీరం సంస్థ మాంజ్రీ ప్లాంట్లోని టెర్మినల్-1 గేట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది.
దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం మంటలారిపే పనిలో పడ్డారు. అయితే ప్రమాదం ఎందువల్ల జరిగింది అన్న దానిపై ఇంకా కారణాలు బయటపడలేదు. ఇదిలా ఉంటే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసిన ఇండియన్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ విధానం ప్రస్తుతం ఇక్కడ జరగటం లేదని సమాచారం.