ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ మూడో దశ ట్రైల్స్ లో ఉందని, త్వరలో అందుబాటులోకి రావడం గ్యారంటీ అని వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది దేశవ్యాప్తంగా ప్రజలు వ్యాక్సిన్ వచ్చేస్తుంది అని ఫుల్ ఖుషీగా ఉన్నారు. కొంతమంది అయితే మాస్క్ లు కూడా పెట్టుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఇటువంటి తరుణంలో సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం మూడు రకాల కరోనా టీకాలు చివరి దశలో ఉన్నట్లు…. అంతా అభివృద్ధి జరిగి ప్రతి భారతీయుడికి చేరుకోవాలంటే మరో ఏడాది పడుతుందని రాకేష్ మిశ్ర షాకింగ్ కామెంట్ చేశారు. ఎక్కువ మోతాదులో కరోనా టీకా అందుబాటులోకి ఈ ఏడాదిలోనే రావటం అనేది అసంభవం అని తెలిపారు. ఈ లోపు అనేక గ్రామాలలో మరియు పట్టణాలలో వైరస్ వ్యాప్తి పెరిగిపోతుందని, దీనివల్ల వృద్ధులు మరియు చిన్న పిల్లలు చనిపోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
అమెరికా సంస్థ మెడర్ణ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్, సిరం ఇనిస్ట్యూట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కూడా టైం పట్టే అవకాశం ఉందని రాకేశ్ మిశ్రా తెలిపారు. మొత్తం మీద చూస్తే ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే ఏడాది పడుతుందని మధ్యలో చాలా మూల్యం చెల్లించకున్నే అవకాశం ఉంటుందని, కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
ఇదిలా ఉండగా ఇండియాలో ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఓకే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వేరే దేశాల నుండి ఎలాంటి వ్యాక్సిన్ కొనుగోలు చేయకూడదని గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రష్యాలో ఆగస్టు 11 వ తారీకున అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడో దశ ట్రయిల్ జరగకుండానే వ్యాక్సిన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి అది ఎంత మేరకు పనిచేస్తుంది అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం మన దేశంలో 3 కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులోకి రానున్నాయి. మూడు కూడా మూడో దశ హ్యూమన్ ట్రైల్స్ లో ఉన్నవి.