మహమ్మారి కరోనా వైరస్ మానవ జీవితాలను తలకిందులు చేస్తూ మనుషుల్లో మానవత్వం లేకుండా చేసి పారేసింది. ఎవరైనా కొరోనా బారిన పడితే సొంత ఇంటి వారైనా అతని అంటరానితనంగా….చూస్తున్న ఘటనలు ప్రస్తుతం కళ్ళముందు కనబడుతున్నాయి. పరిస్థితులు ఇలా ఉండగా కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు చేయటానికి కూడా కుటుంబ సభ్యులు రాకపోవటంతో ఓ పాత్రికేయుడు మానవత్వం చాటుకున్నాడు, అన్నీ దగ్గరుండి తానే చూసుకున్నాడు .
పూర్తి వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కు చెందిన బీజేపీ నాయకుడు కుటుంబరావు కరోనా బారిన పడి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకుని ఇటీవల మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని తరలించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న మృతుని ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ ఉదయ్ తనకున్న పరిచయాలతో మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేశాడు.
అంతేకాకుండా మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేయడానికి అందరూ భయపడుతున్న తరుణంలో ఉదయ్ పీపీయి కిట్ ధరించి అంత్యక్రియలు దగ్గరుండి ఉదయ్ పూర్తి చేయడంతో అందరూ అతని ప్రశంసించారు. మానవత్వం పరిమళించింది అని, ఈ పోస్టు సోషల్ మీడియాలో చూసి నెటిజన్లు కూడా అభినందించారు.