Covid third wave: భారత దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. దేశంగా రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. మరణాల సంఖ్య తక్కువగా ఉంది. అయితే థర్డ్ వేవ్ హెచ్చరికలు మాత్రం జనాలను భయపెట్టేస్తున్నాయి. సెకండ్ వైఫ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. దాదాపు రెండున్నర నెలలు ప్రజలను విపరీతంగా ఇబ్బంది పెట్టేసింది. వేలల్లో మనుషులు చచ్చిపోయారు.
ఇక మహారాష్ట్ర అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ లో పూర్తిగా వణికిపోయింది. కోవిడ్ వల్ల దేశంలో ఎక్కువగా నష్టపోయింది వాళ్ళే. మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా చోటుచేసుకున్నాయి. ఇక ఈ మూడవ వేవ్ లో డెల్టా ప్లస్ వేరియంట్ బాగా తీవ్రంగా వ్యాపిస్తుందని ఎన్నో రిపోర్టులు వచ్చాయి. ఇందుకు ఊతంగా ఇప్పుడు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు మరొక రిపోర్టుతో ముందుకు వచ్చారు.
రెట్టింపు సంఖ్యలో కోవిడ్ కేసులు మూడవ వేవ్ లో వస్తాయని తేల్చేశారు. మహారాష్ట్ర కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ బృందం ఈ మేరకు హెచ్చరికను జారీ చేసింది. ప్రభుత్వం కూడా దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన ఆదేశించారు.
ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక మహారాష్ట్రలో ఈ థర్డ్ వేవ్ వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఈ ఈ భయంకర వైరస్ వ్యాధి వ్యాప్తికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాగే సెరో సర్వేను కూడా వేగవంతం చేయాలని సూచించారు.
దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా కార్యరంగంలోకి దిగింది. అన్ని ప్రాంతాల్లో మందులు. వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు చిన్నారులపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని సూచించారు.