{ఫైల్ ఫోటో)
అమరావతి, మార్చి 24: జనసేన, సిపిఐల మధ్య నెలకొన్న సీట్ల పంచాయతీ వివాదం పరిష్కారమయ్యంది.
ఆదివారం సిపిఎం నేతల మధ్యవర్ధిత్వంలో సిపిఐ రాష్ట్ర నేతలు, జనసేన నేతలు నెలకొన్న వివాదంపై చర్చించారు.
సీట్ల సర్దిబాటలో భాగంగా సిపిఐకి కేటాయించిన నూజివీడు అసెంబ్లీ స్ధానంకు బదులు గన్నవరం సీటు కేటాయిస్తున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. జరిగిన పరిణామాలపై తొలుత సిపిఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా, జనసేన, సిపిఎం నేతలు సర్దిచెప్పడంతో మెత్తబడినట్లు సమాచారం.
సీట్ల వివాదం సామరస్యంగా పరిష్కారం కావడంతో గన్నవరం అసెంబ్లీ స్థానానికి సిపిఐ అభ్యర్ధిని ఖరారు చేసింది.
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం సిపీఐ అభ్యర్ధిగా సయ్యద్ అప్సర్ ను రాష్ట్ర పార్టీ కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు.