అమరావతి: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి సంఖ్యాబలాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలను సిపిఐ జాతీయ నేత కె నారాయణ తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా ఆయన శనివారం స్పందించారు.
నిన్నటి ఏపి శాసనసభ సమావేశాల్లో తన ప్రసంగాన్ని అడ్డుకున్న టిడిపి సభ్యులను ఉద్దేశించి జగన్ తాము 150మంది ఉన్నామనీ, తాము తలుచుకుంటే సభలో ఒక్క టిడిపి సభ్యుడు కూడా ఉండరని వ్యాఖ్యానించడాన్ని వివిధ పార్టీల నేతలు తప్పుపడుతున్నారు. దీనిపై నారాయణ స్పందిస్తూ..23 మంది ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఇక చట్టసభలలో ఇంకా తక్కువ మంది సభ్యులు ఉన్న ప్రతిపక్షాలకు చట్టసభలు అప్రకటిత నిషేధమేనా అని ప్రశ్నించారు.