(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వేసిన కమిటీలు కేవలం కాలయాపనకేననీ, ఇవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఏపిలో జగన్ విధ్వంసకర పాలనకు శ్రీకారం చుట్టారని అన్నారు. మూడు రాజధానులంటూ కొత్త వివాదాన్ని జగన్ సృష్టించారనీ, దీంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనీ నారాయణ పేర్కొన్నారు. జగన్ చెప్పినట్లే ఆ కమిటీల నివేదికలు ఉంటాయని అన్నారు. జిఎన్ రావు ఏమైనా పోటుగాడా, ఆయన గురించి అందరికీ తెలుసునని నారాయణ విమర్శించారు. అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. విశాఖ భూ కుంభకోణంలో కాంగ్రెస్, వైసిపి నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు.
జార్ఖండ్లో బిజెపి ఓటమి తరువాత జగన్ యూటర్న్ తీసుకున్నారని నారాయణ విమర్శించారు.