Ys Vivekananda Reddy : సరిగ్గా 2019 ఎన్నికల ముందు మార్చి నెలలో వైఎస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడటం తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హత్య విషయంలో అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ మరియు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది. కావాలని జగన్ ప్రజల్లో సానుభూతి పొందటానికి.. హత్య చేయించాడని టిడిపి పార్టీ నేతలు ఆరోపించాగా, టీడీపీ పార్టీకి చెందిన నాయకులే కావాలని.. కడప లో మెజార్టీ సాధించడం కోసం, వైయస్ వివేకానంద రెడ్డిని అడ్డు తొలగించుకోవడం కోసం హత్య చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు.
అయితే ఈ హత్య విషయానికి సంబంధించి టిడిపి హయాంలో విచారణ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి హయాంలో విచారణ జరగగా దీనిపై… హైకోర్టుకు వెళుతూ సిబిఐ విచారణ వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి కోరడం జరిగింది. ఈ క్రమంలో హత్య జరిగి రెండు సంవత్సరాలు అయినా గాని… కొలిక్కి రాకపోవడంతో ఇటీవల డాక్టర్ సునీత .. తన తండ్రి హత్య గురించి కీలక కామెంట్లు చేయడం జరిగింది. మాలాంటి వారికి న్యాయం జరగకపోతే సామాన్యులకు ఇంకెలా న్యాయం జరుగుతుందని అన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ హత్య కేసు గురించి సిపిఐ నారాయణ కీలక కామెంట్లు చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు కారణం ఏమిటో దానికి సంగతి ఏమిటో వైయస్ కుటుంబ సభ్యుల చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటి గుట్టు కనుక.. ఈ విషయంలో ఏసీబీ గాని సిబిఐ గాని ఏమీ చేయలేదని.. ఏమాత్రం మానవత్వం నిజాయితీ ఉంటే కుటుంబ సభ్యులే తేల్చాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ విషయానికి సంబంధించి విజయమ్మ నాయకత్వం వహించాలని నారాయణ కోరారు. వివేకానంద రెడ్డి కూతురు కి కుటుంబ సభ్యులే న్యాయం చేయాలని తెలిపారు.