ఆంధ్రప్రదేశ్ లో మనుగడ సాగించటమే కష్టతరంగా ఉన్న టిడిపి తెలంగాణలో సాహసం చేయబోతోందట.త్వరలో జరగనున్న గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోందని సమాచారం.
అసలు తెలంగాణా లో తెలుగుదేశమే లేదనుకున్న సమయంలో ఆ పార్టీ పోటీకి సిద్ధపడటం నిజంగా సంచలనమే.గత గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిస్తే టీడీపీ ఒక్క సీటుకే పరిమితమైంది. తర్వాత పరిణామాల మధ్య ఆయన కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి మహా కూటమి కట్టినా టిడిపికి కేవలం రెండు సీట్లు వచ్చాయి .లోక్సభ ఎన్నికల్లో టిడిపి అడ్రస్ లేకుండా పోయింది. టీఆర్ఎస్ ఇంకా అత్యంత బలంగా ఉందనే పరిశీలకులు భావిస్తున్నారు.అయితే కెసిఆర్ ప్రభుత్వంపై తెలియనంత ప్రజావ్యతిరేకత లోలోన ఉందని టిడిపి భావిస్తోంది .మరోవైపు టిఆర్ఎస్లో కూడా ప్రాధాన్యం దక్కని కొందరు నేతలు పక్కదారులు చూస్తున్నారని ,వారంతా టిడిపి కి క్యూ గట్టే అవకాశముందని పసుపు పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు.
మొత్తం మీద ఈసారి పరిస్థితి టిఆర్ఎస్ కి అంత ఏకపక్షంగా ఉండదని టీడీపీ భావిస్తోంది. అందుకే.. నూట యాభై డివిజన్ల గాను కనీసం అరవై నుండి డెబ్బై డివిజన్లలో పోటీకి టిడిపి సిద్ధపడుతోందని సమాచారం రంగంలోకి దిగాలని నిర్ణయించారు.అదే సమయంలో సొంతంగా పోటీ చేయాలని కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. మొత్తం 150 డివిజన్లకు గాను కనీసం 60 నుండి 70 డివిజన్లలో పోటీచేయడానికి టిడిపి సిద్దపడుతోందని సమాచారం.హైదరాబాద్ సిటీ అభివృద్ధి టీడీపీతోనే జరిగిందని, ఆ అభిమానం ప్రజల్లో ఇప్పటికీ ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికితోడు సెటిలర్ల ఓటు బ్యాంకు కూడా టీడీపీకే ఉంటుంది.
ఎన్నికల్లో హైదరాబాద్లో తమ పార్టీకి ఏపాటి బలం ఉందో నిరూపించకుంటే భవిష్యత్ మరింత చీకటిమయం అవుతుందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబుతో తరచూ హైదరాబాద్ సిటీ టిడిపి నేతలు సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.చంద్రబాబు కూడా హైదరాబాదు సిటీలో మళ్ళీ సైకిలుని పరిగెత్తించడానికి ఉత్సాహంగానే ఉన్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.ఇదే జరిగితే కారుతో సైకిల్ను ఢీ కొట్టడానికి కెసిఆర్ ప్రయత్నించకుండా వుంటుంటారా?చూడాలి ఏం జరుగుతుందో !!