గన్నవరం మాజీ ఎంఎల్ఏ, కృష్ణా జిల్లా విజయ డెయిరీ డైరెక్టర్ దాసరి వెంకట బాలవర్థన్రావు టిడిపికి గుడ్ బై చెప్పారు. శుక్రవారం లోటస్ పాండ్లో జగన్ను కలిసి వైసిపిలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బాలవర్ధన్ రావు మాట్లాడుతూ… గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని అన్నారు. ప్రజల కష్టసుఖాలు చెప్పుకునే పరిస్థితి టిడిపిలో లేదని అన్నారు. కార్యకర్తల భవిష్యత్ కోసం తాను వైసిపిలో చేరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, బాలవర్థన్ రావు సోదరుడు దాసరి జై రమేష్ పాల్గొన్నారు. జై రమేష్ ఇటీవలే వైసిపిలో చేరారు. జై రమేష్ టిడిపి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.
బాలవర్థన్రావు 1994లో గన్నవరం నుంచి టిడిపి తరపున ఎంఎల్ఏ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో ఎంఎల్ఏగా గెలిచారు. 2004లో మళ్లీ ఓటమిపాలైన బాలవర్థన్రావు.. 2009లో విజయం సాధించారు. 2014లో వల్లభనేని వంశీ ఎంట్రీతో బాలవర్థన్రావుకు టికెట్ దక్కలేదు. టికెట్ రాకపోయినా టిడిపిలో కొనసాగుతూ కృష్ణా జిల్లా విజయ డెయిరీ డైరెక్టర్గా ఉన్నారు.