Breaking: ఏపీ విద్యాశాఖ రాష్ట్రంలో పాఠశాలలకి వేసవి సెలవులు ప్రకటించింది. మే ఆరవ తారీఖు నుండి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో మే 4వ తారీఖు లోపు అన్ని పరీక్షలు పూర్తి చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జూలై 4వ తారీకు పాఠశాలలు రీఓపెనింగ్ చేస్తున్నట్లు.. తాజాగా నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒంటిపూట బళ్ళు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పరీక్షలు పూర్తి చేసి.. మే 6 నుండి వేసవి సెలవులు ఇస్తున్నట్లు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది నుండి పూర్తిగా ఏపీ పాఠశాలలో ఇంగ్లీష్ బోధనలో తరగతులు జరగనున్నట్లు సమాచారం.