అమరావతి: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో అవినాష్ పార్టీలో చేరగా ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు కడియాల బుచ్చిబాబు వైసిపిలో చేరారు.
తెలుగుయువత రాష్ట అధ్యక్ష పదవికి, టిడిపికి ఈ ఉదయమే అవినాష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇసుక సమస్యపై టిడిపి అధినేత చంద్రబాబు 12 గంటల దీక్ష చేస్తున్నతరుణంలో ఆ పార్టీకి అవినాష్ గట్టిషాక్ ఇవ్వడం గమనార్హం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నెల తిరగక ముందే యువజన నాయకుడిగా రాష్ట్ర వ్యాప్త గుర్తింపు పొందిన అవినాష్ పార్టీని వీడటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?