అమరావతి: రాజధాని గ్రామాల్లో సీఎం జగన్ పాదయాత్ర చేయగలరా ? అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ మంత్రి కొడాలి నానిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించడం కొడాలి నాని మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుని నిలబడ్డ విషయాన్ని కొడాలి నాని మర్చిపోవద్దని సూచించారు. జగన్ మనసులోని భావాలనే కొడాలి నాని బయటకు చెబుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని గ్రామాల్లో దమ్ముంటే పాదయాత్ర చేయాలని జగన్ కు సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వ పతనానికి నిన్ననే నాంది పడిందని దేవినేని పేర్కొన్నారు.
previous post