ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసులకు అందించే భీమాను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల సహజ మరణానికి ఇచ్చే బీమా మొత్తం లక్షా 50 వేల నుంచి మూడు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఎస్బిఐ తో పోలీసుల కోసం జీవన జ్యోతి బీమా, సురక్ష బీమా అదే రీతిలో ఎంవోయూ పై డిజిపి సవాంగ్ సంతకం చేయడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ లలో బుధవారం నుంచి పోలీసులు అందజేయనున్నారట.
మంగళవారం అధికారికంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ లా అండ్ ఆర్డర్ ఏడిజి శివ శంకర్, కానిస్టేబుల్ డి రజిని, దుర్గా ప్రసాద్ కి పాలసీలు అందించడం జరిగిందట. అక్టోబర్ 21 నుంచి పది రోజుల పాటు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు రాష్ట్రంలో జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఏపీలో అమలు చేస్తున్నట్లు కొనియాడారు.
మహిళల రక్షణ కొరకు దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేసినట్లు, సాంకేతికంగా ప్రజలకు అందుబాటులో రకరకాల సేవలతో ఏపీ పోలీస్ వ్యవస్థ మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో సాంకేతికంగా జియో ట్యాగింగ్ తో మ్యాపింగ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా దేవాలయాలపై దాడులు కేసులకు సంబంధించి 306 కేసులను చేదించడం ఓ రికార్డ్ అని కొనియాడారు. ఏది ఏమైనా ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరు అమోఘం అన్నట్టుగా కొనియాడారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.