దేశంలో ఉన్న సీనియర్ నాయకులలో ఒకరు చంద్రబాబు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం అతనికి ఉంది అంటూ ఎప్పటికప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండటం జరిగింది. అదే టైంలో విభజన జరిగిన తర్వాత ఏపీలో అధికారంలోకి రావడం తెలిసిందే. కాగా ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చిత్తుగా ఓడిపోవడం, పైగా వయసు మీదపడటంతో పార్టీని ముందుకు నడిపించడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో పార్టీలో చాలామంది నాయకులు ఇతర పార్టీ లోకి వెళ్లి పోతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీని కాపాడు కోవడం చంద్రబాబు కి కత్తి మీద సాములాగా మారినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల పార్టీ వర్చువల్ మీటింగ్ జరిగిన ప్రతిసారి త్వరలో జమిలి ఎన్నికలు జరుగుతాయని చెప్పుకొస్తున్నారు. పార్టీ క్యాడర్ మొత్తం రెడీగా ఉండాలని… పేర్కొంటున్నారు. మొదటిలో పార్టీ నేతలను ఉత్సాహ పరచడానికి అనుకున్న ప్రత్యర్థులు..ఇప్పుడు చంద్రబాబు పదే పదే ఈ వ్యాఖ్యలు చేయడం ఆలోచనలో పడేసింది. మోడీ ..జగన్ లకు కూడా తెలియని టాప్ సీక్రెట్ రాజకీయాలు చంద్రబాబు కి తెలుసా? ఆయనకి ఏమైనా సమాచారం ఉందా? అనే డిస్కషన్లు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నాయి. పక్కా సమాచారం ఉండబట్టే…. జమిలి ఎన్నికలు విషయంలో చంద్రబాబు కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు మరోపక్క టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాదు అన్నట్టుగా పరిశీలికుల మాట. జమిలి ఎన్నికలు జరగాల్సి వస్తే తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు క్యాన్సిల్ అవుతాయని, అలాంటిది ఏమీ లేదు అనే టాక్ విశ్లేషకుల నుండి వస్తుంది. దీంతో చంద్రబాబు కేవలం పార్టీ నాయకులలో హుషారు తెప్పించడానికి… మాత్రమే ఎత్తుగడ వేసినట్లు టాక్ వస్తోంది. ఏది ఏమైనా జమిలి ఎన్నికలు అంటూ…2022 లోనే వస్తాయని ప్రతిసారి చంద్రబాబు, ప్రతి సమావేశంలో టిడిపి కార్యకర్తలకు చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.