తెలుగు రాజకీయాలలో సీనియర్లు చంద్రబాబు రాజకీయాల గురించి ఎక్కువగా చెప్పే మాట… అవసరం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఆయన వ్యవహరిస్తారని అంటారు. తాజాగా ఇప్పుడు ఈ విధంగానే ఇటీవల ప్రకటించిన కొత్త కమిటీల విషయంలో చంద్రబాబు రెండు కుటుంబాలకు షాక్ ఇచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు అవుతున్నాయి. ఇటీవల రాష్ట్ర కమిటీ ప్రకటించక ముందే జాతీయ కమిటీ చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పోలిట్ బ్యూరో లిస్ట్ కూడా ఇచ్చేయడం జరిగింది. కాగా వీటిలో అనంతపురం జిల్లాకు చెందిన జేసీ కుటుంబాన్ని అదేవిధంగా కర్నూలు ప్రాంతానికి చెందిన భూమా కుటుంబానికి ఎక్కడా కూడా ప్రాతినిధ్యం లభించలేదు. ఏపీ రాజకీయాలలో ఈ రెండు కుటుంబాలు రాజకీయంగా ఎక్కువగా ప్రభావం చూపే శక్తులే. మరి ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఈ రెండు కుటుంబాలను పక్కన పెట్టడం ఏంటి అనేది ఇప్పుడు చాలా సస్పెన్స్ గా మారింది.
అయితే ఈ విషయంలో లెక్క కుదరలేదని కొందరు అధినేత వ్యూహం మరొకటి ఉందని అంటున్నారు. సరిగ్గా 2014 ఎన్నికల ముందు టిడిపి పార్టీలో చేరిన పితాని సత్యనారాయణ కి పోలిట్ బ్యూరో పదవిని కట్టబెట్టడం జరిగింది. పితాని మాత్రమే కాకుండా అరడజన్ మాజీ మంత్రులకు పోలిట్ బ్యూరో పదవులను చంద్రబాబు కట్టబెట్టడం జరిగింది. ఇదిలా ఉండగా ఒకపక్క కేసులు గొడవలతో జేసీ కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఈ క్రమంలో పార్టీ పదవులు కూడా రాకపోవడంతో జెసి ఫ్యామిలీ టిడిపి హైకమాండ్ పై అసహనం కలిగి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు ఫైల్ అయినప్పుడు నారా లోకేష్ వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈక్రమంలో జేసీ సోదరులపై వేధింపులా అంటూ చంద్రబాబు నాయుడు కూడా ఆ సమయంలో రియాక్ట్ అయ్యారు. వైసీపీకి సరెండర్ కాకపోవడం వల్లే తమపై ఇలాంటి కేసులు బనాయిస్తూ నట్లు జేసీ కుటుంబం చెప్పు కొస్తుంది. రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాదు అన్నట్టుగా జిల్లాలో కేసులు ఎదుర్కొంటున్న మరికొంత మందికి పార్టీ పదవులు కట్టబెట్టడం జెసి ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం పార్టీలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
మరోపక్క కర్నూలు జిల్లాలో టీడీపీకి అండగా ఉండే భూమా ఫ్యామిలీ…అప్పుడప్పుడు పార్టీ వాయిస్ వినిపిస్తున్న భూమా అఖిలప్రియ కు ఎటువంటి పదవి దక్కలేదు. పార్టీలో అఖిలప్రియ కంటే డమ్మీ మహిళా క్యాండీట్ లకి టిడిపి హైకమాండ్ పదవులు కట్టబెట్టడం జరిగింది. ఈ తరుణంలో అఖిల ప్రియా కి ఏ పదవి రాకపోవడంతో జెసి అదే విధంగా భూమా కుటుంబాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నట్లేనా అనే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్ లో గట్టిగా వినబడుతోంది.