టిడిపి పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని 2019 ఎన్నికలలో మూటగట్టుకొన్నట్లు చాలా మంది సీనియర్లు చెబుతుంటారు. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలోనే ఎన్నడూ లేనంతగా దారుణమైన ఫలితాలని విశ్లేషిస్తుంటారు. కాగా ఇంత దారుణంగా టిడిపి పార్టీ పతనానికి అతి పెద్ద పొరపాటు బీసీ వర్గాన్ని పట్టించుకోకపోవటం అని ఇటీవల తేలిందట. తమకి ముందు నుండి పార్టీకి అండగా ఉన్న బీసీ వర్గం నాయకులను పక్కన పెట్టడమే అని, అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు పట్టించుకోకుండా ఉండటమే ఆయన చేసిన పొరపాటు అని ఇటీవల టీడీపీ సీనియర్లు గుర్తించారట.
ఇందువల్లే ప్రస్తుతం చంద్రబాబు బీసీ వర్గాల మద్దతు మళ్లీ కూడగట్టడానికి అష్టకష్టాలు పడుతున్నారు అని, ఇటీవల పార్టీకి సంబంధించి ప్రకటించిన కొత్త కమిటీలలో వారికే పెద్దపీట వేయడం దానికి నిదర్శనం అని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. కానీ మరోపక్క అధికారంలో ఉన్న జగన్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు దాదాపు బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి అన్నట్టుగా ఉన్నాయని ఈ విషయంలో చంద్రబాబు మళ్లీ తన ఓటు బ్యాంక్ ఎలా కాపాడుకుంటారు అన్నది మాత్రం ఏపీ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నార్థకంగా ఉందని విశ్లేషిస్తున్నారు.
చంద్రబాబు ఉన్నంతకాలం కీలకమైన పదవులలో సొంత సామాజికవర్గానికి చెందిన వారికి పెద్దపీట వేయడం వల్లే టిడిపి పార్టీ కొంపముంచినటు అయింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక సొంత వారికి కాకుండా ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేస్తూ పదవులు ఇవ్వటమే కాక సంక్షేమ పథకాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వటం తో చాలావరకు బీసీ వర్గానికి చెందిన ప్రజలు, నాయకులు వైసీపీకి ఆకర్షితులవుతున్నట్లు వార్తలు వైరల్ అవ్వుతున్నాయి. దీంతో బీసీ వర్గాల ప్రజలకు తన హయాంలో జరిగిన అన్యాయానికి ప్యాచ్ వర్క్ కొత్త కమిటీ పదవులతో చంద్రబాబు స్టార్ట్ చేసినట్లు ఏపీ పాలిటిక్స్ లో టాక్.