మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో తిరిగి కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించాలని తెగ తాపత్రయ పడుతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో కూడా కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయినట్లు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు జాయిన్ అయ్యే లిస్ట్ కూడా సిద్ధం చేసి వాళ్లకి చూపించినట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఇంత సడన్ గా నిద్ర మేలుకోవడం వెనకాల చంద్రబాబు ఉన్నట్లు టాక్ వస్తోంది.
పూర్తి విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ బలమైన రాజకీయ నేతగా రోజురోజుకీ ఎదిగిపోతూ ఇతర పార్టీలకు ఓటు బ్యాంకు సామాజికవర్గాలని తన సంక్షేమ పథకాలతో ఆకర్షిస్తూ తనవైపు తిప్పు కుంటూన్నారని బాబు భావిస్తున్నారట. దీంతో ఇలానే ఉంటే ఇంకా దుకాణం సర్దుకోవాల్సిందే అని భావించి కాంగ్రెస్ పార్టీని మేలుకొలిపే రీతిలో చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డిని కదిపినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు ప్రస్తుతం వైసీపీ పార్టీకి అండగా ఉంటున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్ పార్టీకి ఎక్కువ మద్దతు తెలుపుతూ ఉంది. దీంతో కాంగ్రెస్ ని బరిలోకి మళ్ళీ దింపి…. జగన్ కి ఉన్న బలాన్ని సగం చేస్తే కొంత మేరయినా తగ్గించినట్లు అవుతుందని చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి తో పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో ఏపీలో రాహుల్, ప్రియాంక గాంధీ ల సమక్షంలో భారీ సమావేశం కూడా స్టేట్ లో జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.