రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు ఒప్పందం ప్రకారం ప్రతి ఏప్రిల్ మాసంలో కౌలు డబ్బులు ప్రభుత్వం చెల్లించాలి. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు నెలలు గడిచినా గాని రాజధాని రైతులకు కౌలు డబ్బులు ఇవ్వలేదు. జీవో పాస్ చేసిన గాని రాజధాని రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు. దీంతో రాజధాని ప్రాంత రైతులంతా కలిసి విజయవాడలో AMRDA కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కౌలు డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
దెబ్బకి జగన్ ప్రభుత్వం భూ సమీకరణ లో భూములిచ్చిన రైతులకు ఇవ్వవలసిన కౌలు డబ్బులు వెంటనే చెల్లించడం జరిగింది. అంతేకాకుండా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పటికే రాజధాని విషయంలో అమరావతి రైతులు కోర్టులకు వెళ్లి… చాలావరకు ప్రభుత్వంపై… పైచేయి సాధించే రీతిలో వ్యవహరిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో తమకు రావలసిన డబ్బుల విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో ఎక్కడ తగ్గకుండా నిరసనకు దిగారు. కోర్టుకు వెళ్లకుండా ఈ రీతిగా చేయడంతో అమరావతి రైతుల పవర్ ఏంటో ముందే తెలిసి వచ్చిందో ఏమో తెలియదు గానీ ఆ నెక్స్ట్ డే నే జగన్ ప్రభుత్వం కౌలు డబ్బులు రిలీజ్ చేయడంతో పరిస్థితి చాలావరకు సద్దుమణిగింది. మూడు రాజధానులు నిర్ణయం తీసుకునే ఇప్పటికే అమరావతి రైతులకు జగన్ సర్కార్ ద్రోహం చేసినట్లయింది.
మరోపక్క రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను జగన్ సర్కార్ పేదలకు ఇవ్వడాని తప్పు పడుతూ ఇటీవలే రాజధాని రైతులు న్యాయస్థానానికి వెళ్లి అడ్డుకోవడం జరిగింది. అనేక రీతులుగా అమరావతి రైతులు వైసీపీ ప్రభుత్వం తో పోరాడుతూ వస్తున్న తరుణంలో…కౌలు విషయంలో కూడా పోరాడి తాము ఏంటో మరోసారి నిరూపించుకున్నారు అని రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ ప్రభుత్వానికి అమరావతి రైతులు చాలా విషయాల్లో షాకుల మీద షాకులు ఇస్తున్నారు అని మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు.