రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మున్సిపల్ శాఖ తో పాటు అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర వహించారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరు జిల్లా అభివృద్ధిలో తన మార్కు ఉండేలా వ్యవహరించారు. వెలిగిన నారాయణ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత నెల్లూరు జిల్లా సింహపురి కి చుట్టపుచూపుగా వస్తూ పోతూ ఉండటం జిల్లాలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. పైగా అది కూడా తన విద్యాసంస్థల పనులకు సంబంధించి మాత్రమే, ఆ పరిధిలో మాత్రమే నారాయణ అందుబాటులో ఉంటున్నారు అనే టాక్ జిల్లా లో వినపడుతోంది.
అవసరమనుకుంటే అనుచరులతో మాట్లాడటం లేదంటే తన పని ఏదో చూసుకొని సైలెంట్ గా నారాయణ వెళ్లి పోతున్నారట. మాజీ మంత్రి నారాయణ పరిస్థితి ఇలా ఉంటే ఆయన అనుచరుల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన ముఖ్య అనుచరులలో పట్టాభిరామిరెడ్డి ఒకరు. టిడిపి నెల్లూరు సిటీ ఇన్చార్జి పదవి కోసం చాలా సీరియస్ గా ప్రయత్నించారు పట్టాభి. కానీ టీడీపీ హైకమాండ్ వేరే వారికి ఆ పదవిని అప్పజెప్పడం జరిగింది.
దీంతో అసలు బ్యాడ్ టైం నడుస్తుంది నేపథ్యంలో పదవి రాకపోవడంతో పట్టాభి తీవ్ర నిరాశ పడ్డారట. ఇదే టైములో పట్టాభి పార్టీ మారే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ మాజీ మంత్రి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యి… పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. టిడిపి లోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నారాయణ వర్గం మళ్లీ టీడీపీకి దూరమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల పార్లమెంట్ పరిధిలో గా కొంతమంది పదవులు ఇచ్చిన తరుణంలో మాజీ మంత్రి నారాయణ సిఫార్సు చేసిన వారికి పదవులు రాకపోవడంతో…టిడిపి హైకమాండ్ కావాలనే పక్కన పెట్టారనే అభిప్రాయంలో నారాయణ వర్గం ఉందన్న టాక్ నెల్లూరు జిల్లాలో నడుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో టిడిపి చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా నారాయణ అనుచరులు హాజరు కాకపోవడంతో.. నారాయణ రాజకీయంపై జిల్లా రాజకీయ నేతలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అనే టాక్ వస్తోంది. మరోపక్క మంత్రి నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాస్ వైసీపీ లోకి వెళ్లిపోయే పరిస్థితి ఉన్నట్లు వార్తలు రావడంతో నారాయణ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు ఏపీ రాజకీయాలలో టాక్ నడుస్తోంది.