టీడీపీని ఏపీ సీఎం జగన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని పైకి కనిపిస్తున్నప్పటికీ ఆయన ఈ క్రమంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకొని తనకు తానే నష్టం చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుని జగన్ బాహుబలి మాదిరి చూస్తున్నట్లు కనిపిస్తోంది. తెలియకుండానే చంద్రబాబు అంటే జగన్ కి ఒక రకమైన భయం ఉందంటున్నారు.
ముఖ్యంగా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అన్న అపోహ జగన్ కి బలంగా ఉంది. అది నిజమే కావచ్చు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నే న్యాయ వ్యవస్థ ద్వారా ద్వారా చంద్రబాబు హస్తగతం చేసుకున్నారు.అప్పట్లో ఈ విషయంలో అనేక రకాల గుసగుసలు కూడా వినిపించాయి. అలాగే తనపై దాఖలైన అనేక కేసుల్లో చంద్రబాబు స్టే లు తెచ్చుకొని కోర్టు మెట్లు ఎక్కకుండానే ఇంత కాలం గడుపుతూ వచ్చారు. వీటన్నిటి జగన్ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పుల పరంపర వెనక చంద్రబాబు హస్తం ఉందనది జగన్ కి వచ్చిన అనుమానం.దీంతో జగన్ బాగా ముందుకెళ్లిపోయి సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ వద్ద ఆగారు. చంద్రబాబుతో అవినాభావ సంబంధాలు కలిగిన రమణే హైకోర్టు తీర్పులను ప్రభావితం చేస్తున్నారన్న ఓ నిర్ణయానికి వచ్చేశారు.ముందు వెనుక ఆలోచించకుండా రమణపై అనేక ఆరోపణలు చేస్తూ జగన్ నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ కూడా రాసి దాన్ని సైతం మీడియాకు వెల్లడించారు.ఇది అనాలోచితమే కాకుండా ఆవేశపూరితమైన ది నిర్ణయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఏపీ హైకోర్టులో తీర్పులు ఇబ్బందిగా ఉంటే వాటి మీద నమ్మకం లేకపోతే పొరుగు రాష్ట్రానికి ఆయా కేసులను బదిలీ చేయమని సీఎం హోదాలో అడిగే ఆప్షన్ జగన్ కి ఉందని వారు చెప్తున్నారు.
అలా కాకుండా రాజ్యాంగంలో అత్యున్నతమైన వ్యవస్థగా ఉన్న న్యాయ వ్యవస్థ మీద అపనమ్మకం కలిగేలా ఆరోపణలు చేయడం తొందరపాటు నిర్ణయమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కూడా జగన్ అతిగా స్పందించారని, రాయల్ ఏదో చంద్రబాబు మనిషి అన్నట్లుగా జగన్ భావించి ఆయన పై కత్తి దూశారని వారు అంటున్నారు. రమేష్ కుమార్ యాదృచ్ఛికంగా చంద్రబాబునాయుడు సామాజిక వర్గీయుడైన నందున ఆయనపై అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదంటున్నారు.రమేష్ కుమార్ విషయంలో జగన్ కు ఎదురుదెబ్బే తగిలిందని, ఆయన మళ్లీ ఆ పదవిలో కి వచ్చారని వారు గుర్తు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పై ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖ రాసినందుకు జగన్ తప్పక చింతించాల్సిన పరిస్థితులు ఏర్పడగలవు అన్నది వారి విశ్లేషణ.అయితే ఇవన్నీ చంద్రబాబునాయుడంటే ఉన్న భయంతో జగన్ చేసిన పనులని వారు బల్లగుద్ది చెబుతున్నారు.