నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న తరుణంలో రిపబ్లిక్ మరియు డెమోక్రాటిక్ పార్టీ నేతల మధ్య హోరాహోరీ వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో నువ్వానేనా అన్నట్టుగా నేతల కామెంట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా జరగబోయే అధ్యక్ష ఎన్నికలలో ప్రజలు తనను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్ను కొనకపోతే ఖచ్చితంగా దేశాన్ని విడిచి వెళ్ళిపోతానని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జార్జియాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన డోనాల్డ్ ట్రంప్… ప్రత్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోయే అవమానం కన్నా ఇదే బెటర్ ఏమో అని వ్యాఖ్యానించారు.
ఇది జోక్ కింద చెప్పడం లేదని పొలిటికల్ హిస్టరీ లో సరైన విషయం సామర్ధ్యం లేని అభ్యర్థిపై.. పోటీ చేయవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదని… ఇది తనపై ఎంతో ఒత్తిడి తీసుకొస్తుంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా మీడియా వర్గాల లో హైలెట్ గా మారాయి. ఇదిలా ఉండగా అమెరికాలో కీలకమైన రాష్ట్రాలలో జో బైడెన్ డోనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు సర్వేలో బయటపడుతుంది.
చాలా చోట్ల ఫ్లోరిడా ర్యాలీలో ఇంకా కొన్ని ప్రాంతాలలో జో బైడెన్ ర్యాలీకి ఆయన ఇస్తున్న స్పీచ్ కి పబ్లిక్ నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అభద్రతా భావంతోనే డోనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ విషయంలో అనవసరమైన కామెంట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా నవంబర్ మూడవ తారీఖు జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో కాకుండా హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.