నవంబర్ నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో రిపబ్లిక్ మరియు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఎవరికి వారు దూసుకుపోతున్నారు. రిపబ్లిక్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పోటీకి దిగుతున్నారు. ఇలాంటి తరుణంలో స్వతహాగా నోటి దూల కలిగిన ట్రంప్ ఇండియా పై కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. తన ప్రత్యర్థి జో బిడెన్ కి ఉన్న కొద్ది మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో… దానిని డైవర్ట్ చేయడం కోసం డోనాల్డ్ ట్రంప్… ఒక కాలుష్యం పెంచడంలో ప్రపంచంలో భారతదేశం కూడా ఒకటి అని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.
ఇదే విషయంలో చైనా కూడా ముందు ఉంది. కానీ కాలుష్యరహిత నివారణ విషయంలో అమెరికా .. భారత్ – చైనా లకి భిన్నంగా ప్రణాళికబద్ధంగా బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోంది అని కాలుష్య రహితమైన సమాజాన్ని తీసుకొస్తుంది అన్నట్లు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మేధావుల నుండి విమర్శలు వస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం అని… మూర్ఖంగా మాట్లాడుతున్నారని కౌంటర్ లు ఇస్తున్నారు.
అసలు పర్యావరణహిత మైనటువంటి విద్యుత్ ఉత్పాదన నినాదాన్ని ప్రపంచంలో మొట్టమొదటి గా ఇచ్చిన దేశం భారతదేశం అని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం భారతదేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ క్రమంగా తగ్గించుకుంటూ ధర్మల్ వస్తుందని చెప్పుకొస్తున్నారు. అట్లాగే ప్రపంచానికి సోలార్ విండ్ పవర్ గురించి ఒక వరల్డ్ గ్రిడ్ ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్ భారత్ అని…ఈ తరహా రీతిలో వ్యవహరించే ప్రపంచదేశాలకు మద్దతు ఇస్తున్నట్లు మేధావులు తెలుపుతున్నారు. అసలు అమెరికాలోనే ఎక్కువ పొల్యూషన్ ఉందని… ప్రపంచంలో ఎక్కువ అడవులు తగలబడుతోంది అమెరికాలోనే అన్ని ట్రంప్ భారత్ పై చేసిన వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు.