తిరుమల: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) సమీక్షలు నిర్వహిస్తున్నారనీ. ఆంధ్రప్రదేశ్పై ఈసి నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని డిప్యూటి ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు.
శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సిఎస్ ఎల్వి సుబ్రమణ్యంను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను నియంత్రించాలని మోదీ కుట్ర చేస్తున్నారని చిన రాజప్ప ఆరోపించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా కొంత మంది కుట్రలు పన్నుతున్నారనీ, టిటిడిలో ఏదో జరుగుతున్నట్లు అపోహలు సృష్టిస్తున్నారని చిన రాజప్ప ఆరోపించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?