Big Breaking: కావాలని అనేక ఇబ్బందులు పాలు చేసి ఉద్దేశపూర్వకంగా రాత్రికి రాత్రే తనని మంత్రి పదవి నుండి తప్పించారని టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన మల్కాజిగిరి జిల్లా, శామీర్పేటలో ఉన్న ఇంటిలో మీడియా సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రతి కార్యకర్త తో కలసి పని చేసినట్లు స్పష్టం చేశారు. అటువంటి నియోజకవర్గంలో ప్రాణం ఉండగానే తన ప్రాణాన్ని టిఆర్ఎస్ పార్టీ నేతలు బొంద పెట్టారని పేర్కొన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో నాయకులకు కార్యకర్తలకు.. డబ్బులు ఆశ చూపించారని.. ప్రజాప్రతినిధులను భయాందోళనలకు గురిచేశారని.. ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు ఇప్పటిదాక పన్నినా హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీని బలపరిచింది మాత్రం ఈటల రాజేందర్ మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనపై రాజకీయంగా జరుగుతున్న దాడి విషయంలో నియోజకవర్గానికి చెందిన వారు ఎలా ఇటువంటి నాయకులను ఎదుర్కొంటావు అని ప్రశ్నించారు.
Read More: Eetela Rajendar: ఈటెల కొత్త పార్టీ.. మరో ముగ్గురు కీలక నేతలు కూడా..!?
అంత మాత్రమే కాక తనతో పాటు పోరాటం చేస్తామని నియోజకవర్గ ప్రజలు భరోసా ఇచ్చారు అంటూ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ విధంగా తనని అనేక ఇబ్బందుల పాలు చేసినా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈటల ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎటువంటి ఎన్నికలు వచ్చినా నియోజకవర్గ ప్రజలు తనకు అండగా ఉంటారని.. తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సార్లు రాజీనామా చేశాను అంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే రీతిలో ముఖ్యమంత్రి నివాసం “ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్” అంటూ సెటైర్లు వేశారు.